కొవిడ్ టీకాల కోసం ఒడిశా సర్కారు సిద్ధం...సీఎం వెల్లడి
ABN, First Publish Date - 2020-12-11T16:19:17+05:30
ఒడిశా రాష్ట్రంలో కొవిడ్-19 టీకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు....
భువనేశ్వర్ (ఒడిశా): ఒడిశా రాష్ట్రంలో కొవిడ్-19 టీకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. కొవిడ్ టీకాల కోసం లాజిస్టిక్సు వ్యవస్థను ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు. దేశంలో త్వరలో కొవిడ్ -19 టీకాలు ఇచ్చే ప్రక్రియ త్వరలో ప్రారంభయ్యే అవకాశముందని, దీనికోసం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి డేటాబేస్ తయారు చేశామని సీఎం వెల్లడించారు. కొవిడ్ టీకాల ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి లాజిస్టిక్సు వ్యవస్థను ఏర్పాటు చేశామని కొవిడ్ పరిస్థితిపై సమీక్షా సమావేశంలో సీఎం నవీన్ పట్నాయక్ చెప్పారు.
కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పరిపాలనా అధికారులను ఆదేశించారు. ప్రజలకు జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎం పట్నాయక్ చెప్పారు. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఒడిశా రాష్ట్రంలో 2,978 కరోనా కేసులున్నాయి.
Updated Date - 2020-12-11T16:19:17+05:30 IST