ఆదివారం లాక్డౌన్ ఉండదు...కర్ణాటక సర్కారు ప్రకటన
ABN, First Publish Date - 2020-05-30T18:44:50+05:30
కర్ణాటక రాష్ట్రంలో ఆదివారం లాక్డౌన్ ఉండదని ఆ రాష్ట్ర సర్కారు ప్రకటించింది....
బెంగళూరు (కర్ణాటక): కర్ణాటక రాష్ట్రంలో ఆదివారం లాక్డౌన్ ఉండదని ఆ రాష్ట్ర సర్కారు ప్రకటించింది. ప్రజల డిమాండ్ మేర కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప ఆదేశాల మేర తాము ఆదివారం లాక్డౌన్ ఎత్తివేస్తున్నట్లు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీఎం విజయభాస్కర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో కరోనా వైరస్ ప్రబలకుండా నివారించేందుకు ఆదివారం పూర్తిగా లాక్డౌన్ విధిస్తూ గతంలో కర్ణాటక సర్కారు నిరయం తీసుకుంది. ఆదివారం లాక్డౌన్ ఎత్తివేసినందున బీఎంటీసీ, కేఎస్ఆర్టీసీ బస్సులు నడపాలని సర్కారు నిర్ణయించింది. మార్కెట్లు, దుకాణాలు తెరచి ఉంచాలని నిర్ణయించారు. అయితే సాయంత్రం 7 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూను విధిస్తామని చీఫ్ సెక్రటరీ ప్రకటించారు.
Updated Date - 2020-05-30T18:44:50+05:30 IST