ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11 రోజుల్లో 6 ఏనుగుల మృతి..9 మంది ఐఎఫ్ఎస్ అధికారులపై బదిలీవేటు

ABN, First Publish Date - 2020-06-20T15:52:04+05:30

చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో 11 రోజుల్లో ఆరు ఏనుగులు మరణించిన ఘటనను తీవ్రంగా తీసుకున్న సర్కారు 9మంది అటవీశాఖ ఉన్నతాధికారులపై బదిలీవేటు వేసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయపూర్ (చత్తీస్‌ఘడ్): చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో 11 రోజుల్లో ఆరు ఏనుగులు మరణించిన ఘటనను తీవ్రంగా తీసుకున్న సర్కారు 9మంది అటవీశాఖ ఉన్నతాధికారులపై బదిలీవేటు వేసింది. బలరాంపూర్, ధర్మజాయ్ ఘడ్, సూరజ్ పూర్, బలరాంపూర్,ధాంతరి, రాయగడ్ జిల్లాల్లోని అడవుల్లో కేవలం 11 రోజుల్లో ఆరు ఏనుగులు మరణించాయి. దీంతో ఆగ్రహించిన చత్తీస్‌ఘడ్ రాష్ట్ర సర్కారు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటరుతోపాటు 8మంది ఐఎఫ్ఎస్ అధికారులైన డీఎఫ్‌వోలపై బదిలీ వేటు వేసింది. ఏనుగుల మృతి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అటవీశాఖ అధికారులను బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫారెస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటరు అతుల్ కుమార్ శుక్లాను వాతావరణ పరిశోధనా సంస్థ పీసీసీఎఫ్ గా బదిలీ చేసింది. రాయపూర్ రాష్ట్ర అటవీ పరిశోధనశిక్షణ సంస్థ డైరెక్టరుగా పనిచేస్తున్న పీవీనర్సింగ్ రావును వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ గా నియమించింది. 

Updated Date - 2020-06-20T15:52:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising