ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో తొలిసారిగా ఒక్కరోజులో అత్యధిక కరోనా కేసులు నమోదు

ABN, First Publish Date - 2020-09-09T15:06:18+05:30

దేశంలో రోజురోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మంగళవారం నాడు కొత్తగా 89,706 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇంతకుముందు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మంగళవారం నాడు కొత్తగా 89,706 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇంతకుముందు అమెరికాలో ఒక్క రోజులో అత్యధికంగా 78 వేలకు మించిన కేసులు నమోదయ్యాయి. కాగా గడచిన 24 గంటల్లో భారత్‌లో కరోనా కారణంగా 1,500కు పైగా బాధితులు మృతి చెందారు. 



అయితే ఇదే సమయంలో 89 వేలకు మించిన కరోనా బాధితులు వ్యాధి నుంచి కోలుకున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 43 లక్షల 55 వేలను దాటింది. కాగా కొత్తగా 89,446 మంది వ్యాధి నుంచి కోలుకుని, వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ దేశం మొత్తం మీద కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 33 లక్షల 86 వేలను దాటింది. కాగా మహారాష్ట్రలో వరుసగా మూడవ రోజు 20 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-09-09T15:06:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising