ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యాంగ సవరణ దిశగా నేపాల్! భారత భూభాగం తమదిగా చూపేందుకు..

ABN, First Publish Date - 2020-06-07T18:04:08+05:30

భారత భూభాగాలైన కాలాపానీ, లిపూలేఖ్, లింపియదూర ప్రాంతాలను నేపాల్‌‌కు చెందినవిగా చూపించే కొత్త మ్యాపుకు రాజ్యంగ పరపతి కల్పిచేందుకు నేపాల్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాట్మండూ: భారత భూభాగాలైన కాలాపానీ, లిపూలేఖ్, లింపియదూర ప్రాంతాలను నేపాల్‌‌కు చెందినవిగా చూపించే కొత్త మ్యాపుకు రాజ్యంగ పరపతి కల్పిచేందుకు నేపాల్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ దిశగా నేపాల్ రాజ్యాంగంలో మార్పులు చేసే బిల్లుపై ప్రతినిధుల సభలో జూన్ 9న వోటింట్ జరగనుంది. నేపాల్ న్యాయశాఖ మంత్రి ఈ రాజ్యాంగ సవరణ బిల్లును మే 31న సభలో ప్రవేశపెట్టారు. భారత్ భూభాగాలను నేపాల్‌లో చేర్చుతూ మ్యాపును తాజా పరిచేందుకు ఉద్దేశించిన ఈ సవరణను అక్కడ ప్రభుత్వం మే 22న ప్లార్లెమెంటు‌లో నమోదు చేసింది. అయితే రాజ్యంగ సవరణకు ఆమోదం తెలిపేందుకు 66 శాతం  సభ్యుల మద్దతు అవసరమవుతుంది. నేపాల్‌లో అధికారంలో ఉన్న కమ్యునిష్టు పార్టీకి ఎగువ సభలో ఈ సవరణకు సరిపడా సభ్యులు ఉన్నప్పటికీ ప్రతినిధుతుల సభలో మాత్రం లెక్కలు తారుమారయ్యాయి. దీంతో అధికార పక్షానికి దిగువ సభలో ఇతర పార్టీల మద్దతు అవసరమైంది. అయితే ఈ సవరణ బిల్లుపై మరింత చర్చ జరగాలని ప్రధాన ప్రతిపక్షమైన నేపాలీ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టడంతో కేపీ శర్మా ఓలీ ప్రభుత్వం ఈ విషయాన్ని మే 27 వరకూ వాయిదా వేసింది. ఈ క్రమంలో మే 30న నేపాలీ కాంగ్రెస్ సవరణ బిల్లుకు మద్దతు తెలపడంతో బిల్లుకు కావాల్సిన సభ్యుల మద్దతు లభించినట్టైంది. దీంతో రాజ్యంగ సవరణకు నేపాల్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అడ్డంకులు తొలగిపోయాయి. 

Updated Date - 2020-06-07T18:04:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising