విరిగిపడ్డ కొండచరియలు..37 మంది మృతి
ABN, First Publish Date - 2020-07-12T01:19:50+05:30
విరిగిపడ్డ కొండచరియలు..37 మంది మృతి
కాఠ్మండు : పశ్చిమ నేపాల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో 15 మంది మృతి చెందారు. మైగ్డి జిల్లాలోనే 15 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య 48గంటల్లో 37కు చేరాయని ఆ దేశ హోం మంత్రిత్వశాఖ తెలిపింది. నిన్న నేపాల్ వ్యాప్తంగా కొండచరియలు విరిగిపడి వేర్వేరు ఘటనల్లో 22 మంది మృతి చెందారు. జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో చిక్కుకున్న వారి ఆచూకీ లభించలేదు. కొండచరియలో చిక్కుకున్న వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
Updated Date - 2020-07-12T01:19:50+05:30 IST