ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య రంగంలో సంస్కరణలు రావాలి: వెంకయ్య

ABN, First Publish Date - 2020-09-27T07:58:38+05:30

కరోనా సృష్టించిన అవాంతరాలను, అడ్డంకులను అవకాశంగా మార్చుకొని సాంకేతికత, కృత్రిమ మేధ సహాయంతో వైద్య రంగంలో సంస్కరణలు తీసుకురావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కరోనా సృష్టించిన అవాంతరాలను, అడ్డంకులను అవకాశంగా మార్చుకొని సాంకేతికత, కృత్రిమ మేధ సహాయంతో వైద్య రంగంలో సంస్కరణలు తీసుకురావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అమెరికాలోని భారత సంతతి వైద్యుల సంఘం (ఆపీ) 38వ వార్షిక సదస్సును ఉద్దేశించి ఆయన ఆన్‌లైన్‌ ద్వారా ప్రసంగించారు. ప్రజల ఆరోగ్య వివరాలను డిజిటలైజేషన్‌ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.


దేశ వైద్య రంగంలో అనేక సవాళ్లతో పాటు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. త్వరలోనే భారత్‌ ప్రపంచంలోనే అత్యుత్తమమైన వైద్య పర్యాటక కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు. అధునాతన సాంకేతిక వ్యవస్థతో పట్టణాల్లో, నగరాల్లో ప్రైవేటు ఆస్పత్రులు, పరిశోధనా కేంద్రాలు ఏర్పాటవుతుంటే... గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్య సదుపాయాలు కూడా లేకపోవడం ఆందోళనకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఆపీ అధ్యక్షుడు డాక్టర్‌ సురేశ్‌ రెడ్డి, ప్రతినిధులు డాక్టర్‌ జొన్నలగడ్డ సుఽధాకర్‌, డాక్టర్‌ సీమ, డాక్టర్‌ సంజనీ షా తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-09-27T07:58:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising