అమ్మ స్ఫూర్తితో పనిచేస్తా: కమలా హారిస్
ABN, First Publish Date - 2020-08-14T06:51:14+05:30
అమెరికా ఉపాధ్యక్ష పదవికి డెమోక్రాట్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన కమలా హారిస్ తొలి ప్రసంగంలో తల్లి శ్యామలా గోపాలన్ను స్మరించుకున్నారు. అమెరికా అధ్యక్షపదవికి పోటీ పడుతున్న జో బైడెన్తో కలిసి ఆమె తొలిసారిగా...
వాషింగ్టన్, ఆగస్టు 13: అమెరికా ఉపాధ్యక్ష పదవికి డెమోక్రాట్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన కమలా హారిస్ తొలి ప్రసంగంలో తల్లి శ్యామలా గోపాలన్ను స్మరించుకున్నారు. అమెరికా అధ్యక్షపదవికి పోటీ పడుతున్న జో బైడెన్తో కలిసి ఆమె తొలిసారిగా బుధవారం డెలావర్లో మాట్లాడారు. తన భారత్-ఆఫ్రికా మూలాల గురించి మాట్లాడుతూ.. భారతీయ అమెరికన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సమస్యలపై పోరాడేతత్వం తల్లి వల్లే తనకు, సోదరి మాయాకు అలవడిందని చెప్పారు. ఆమె స్ఫూర్తితోనే పనిచేస్తానన్నారు. కమల పేరును ప్రకటించిన వెంటనే బైడెన్కు రూ.194కోట్ల నిధులు సమకూరాయి.
Updated Date - 2020-08-14T06:51:14+05:30 IST