అంబానీ, బఫెట్లను దాటేసి.. ప్రపంచ ఏడో సంపన్నుడిగా మస్క్..
ABN, First Publish Date - 2020-07-12T02:03:30+05:30
స్పేస్ ఎక్స్ సీఈవో, టెస్లా యజమాని ఎలన్ మస్క్ మరో ఘనత సాధించాడు.
కాలిఫోర్నియా: స్పేస్ ఎక్స్ సీఈవో, టెస్లా యజమాని ఎలన్ మస్క్ మరో ఘనత సాధించాడు. ప్రపంచ ఏడో సంపన్నుడిగా అవతరించాడు. దీనికోసం భారత కుబేరుడు ముకేష్ అంబానీ, వారెన్ బఫెట్లను ఓవర్టేక్ చేశాడు. శుక్రవారం నాడు మస్క్ ఆస్తుల విలువ 6.1 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ప్రపంచ సంపన్నుల్లో ఏడో స్థానానికి చేరాడని బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. మొత్తమ్మీద 70.5 బిలియన్ డాలర్ల నెట్ వర్త్తో గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్, ముకేష్ అంబానీ, వారెన్ బఫెట్లను దాటిన మస్క్.. ప్రపంచ ఏడో సంపన్నుడిగా అవతరించాడు. కాగా, ఇటీవలే బెర్క్షైర్ హాత్వే స్టాక్ చారిటీకి బఫెట్ 2.9బిలియన్ డాలర్ల విరాళం ఇచ్చాడు. దీంతోనే ఆయన నెట్ వర్త్ తగ్గిందని సమాచారం.
Updated Date - 2020-07-12T02:03:30+05:30 IST