ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంగన ఎవరో నాకు తెలియదు, నేనెప్పుడూ ఆమె సినిమాలు చూడలేదు: ముంబై మేయర్

ABN, First Publish Date - 2020-11-28T00:41:16+05:30

బాలీవుడ్ నటి కంగన రనౌత్‌ ఎవరో తనకు తెలియదని, తానెప్పుడూ ఆమెను చూడలేదని ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: బాలీవుడ్ నటి కంగన రనౌత్‌ ఎవరో తనకు తెలియదని, తానెప్పుడూ ఆమెను చూడలేదని ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ తెలిపారు. కంగన కార్యాలయం కూల్చివేత ఎపిసోడ్‌లో బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) దారుణంగా వ్యవహరించిందన్న ప్రతిపక్షాల విమర్శలను కొట్టిపడేసిన పెడ్నేకర్.. అసలు తానెప్పుడూ కంగనను చూడలేని, ఆమె ఎవరో తనకు తెలియదని స్పష్టం చేశారు. ఆమె కార్యాలయ కూల్చివేతలో కక్ష అన్న దానిని అర్థమే లేదని తేల్చి చెప్పారు. 


చర్యలు తీసుకోవాల్సి వచ్చింది కాబట్టే తీసుకున్నామని, నిజానికి వ్యక్తిగతంగా ఆమె ఎవరో తనకు తెలియదని కిషోరి పెడ్నేకర్ పేర్కొన్నారు. సమయాభావం వల్ల ఆమె సినిమాలను కూడా తాను ఎప్పుడూ చూడలేదన్నారు. కాబట్టి అలాంటి ఆరోపణలు ఇక్కడ సరిపోవని అన్నారు. కంగన పరిహారానికి అర్హురాలన్న బాంబే హైకోర్టు తన తీర్పుతో బీఎంసీకి పాఠం నేర్పిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. అంతేకాదు, మునిసిపల్ కమిషనర్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది. ‘‘ఒకసారి సోషల్ మీడియాను చూడండి. తీర్పుపై సర్వత్ర ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నేను ఆమె గురించి మాట్లాడాలనుకోవడం లేదు. ఈ విషయాన్ని మరింత దగ్గరగా పరిశీలిస్తాం’’ అని మేయర్ పేర్కొన్నారు. బాంబే హైకోర్టు తీర్పుపై బీఎంసీ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు పెడ్నేకర్ నిరాకరించారు.  

Updated Date - 2020-11-28T00:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising