ముంబై చిత్ర పరిశ్రమపై బీజేపీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2020-09-21T23:08:59+05:30
ముంబై చిత్ర పరిశ్రమపై బీజేపీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ముంబై చిత్ర పరిశ్రమపై బీజేపీ ఎంపీ రూప గంగూలీ విమర్శలు గుప్పించారు. ముంబై చిత్ర పరిశ్రమ ప్రజలను చంపి, వారిని మాదకద్రవ్యాలకు బానిసలుగా చేస్తుందని బీజేపీ ఎంపీ రూప గంగూలీ సోమవారం ఆరోపించారు. అయితే ఈ అంశంపై ఎవరూ ఏమీ చేయడం లేదని ఆమె మండిపడ్డారు. ముంబై పోలీసులు మౌనంగా ఉన్నారని ఎంపీ గంగూలీ అన్నారు. అనురాగ్ కశ్యప్పై పాయల్ ఘోష్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై బాలీవుడ్ ఎందుకు మౌనంగా ఉంది? అని ఎంపీ రూప గంగూలీ ప్రశ్నించారు. కశ్యప్పై ముంబై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ఆమె ప్రశ్నించారు.
Updated Date - 2020-09-21T23:08:59+05:30 IST