ప్రతి 15 నిముషాలకు ఒక్కో మృతదేహం బూడిద
ABN, First Publish Date - 2020-04-08T14:55:01+05:30
స్పెయిన్ లో కరోనా వైరస్ కారణంగా రోజువారీ సగటు మరణాల సంఖ్య మంగళవారం 743 కు చేరుకుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల...
మాడ్రిడ్: స్పెయిన్ లో కరోనా వైరస్ కారణంగా రోజువారీ సగటు మరణాల సంఖ్య మంగళవారం 743 కు చేరుకుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం కరోనా కారణంగా దేశంలో 14,045 మంది మరణించారు. కాగా స్పెయిన్ లో ఎక్కడ చూసినా శవాలు కనిపిస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద స్మశానవాటిక అయిన మాడ్రిడ్లోని లా అల్ముడెనాలో ప్రతి 15 నిమిషాలకు ఒక మృతదేహం దహనమవుతోంది. ఈ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు 5 మందికి మించి అనుమతించడంలేదు. ఇటలీ తరువాత కరోనా వైరస్ కారణంగా అత్యధికులు ప్రాణాలు కోల్పోయిన రెండవ దేశం స్పెయిన్. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో సుమారు 5 వేల మంది మరణించారు. ఇక్కడ మార్చి 14 నుండి ప్రారంభమైన లాక్డౌన్ ఇప్పుడు రెండవసారి ఏప్రిల్ 26 వరకు పొడిగించారు.
Updated Date - 2020-04-08T14:55:01+05:30 IST