కొవిడ్పై పోరులో గెలుస్తాం: మోదీ
ABN, First Publish Date - 2020-04-10T08:49:32+05:30
కొవిడ్-19కు వ్యతిరేకంగా మానవాళి చేస్తున్న పోరాటానికి తనవంతుగా భారత్ చేయగలిగినదంతా చేస్తోందని ...
న్యూఢిల్లీ/వాషింగ్టన్, ఏప్రిల్ 9: కొవిడ్-19కు వ్యతిరేకంగా మానవాళి చేస్తున్న పోరాటానికి తనవంతుగా భారత్ చేయగలిగినదంతా చేస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కరోనా చికిత్సకు ఉపయోగపడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులపై నిషేధం ఎత్తివేసినందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై మోదీ స్పందించారు. ‘‘ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి ఆవరించింది. కరోనాను మనం కలిసి జయిస్తాం’’ అని మోదీ ట్విటర్ ద్వారా బదులిచ్చారు.
Updated Date - 2020-04-10T08:49:32+05:30 IST