సీఆర్పీఎఫ్ వీరులకు సెల్యూట్ : మోదీ
ABN, First Publish Date - 2020-04-09T19:49:21+05:30
‘శౌర్య దివస్’ సందర్భంగా సీఆర్పీఎఫ్ జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘సీఆర్పీఎఫ్ బలగాల ధైర్య సాహసాలు ప్రపంచ వ్యాప్తంగా
న్యూఢిల్లీ : ‘శౌర్య దివస్’ సందర్భంగా సీఆర్పీఎఫ్ జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘సీఆర్పీఎఫ్ బలగాల ధైర్య సాహసాలు ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా తెలుసు. సీఆర్పీఎఫ్ శౌర్య దివస్ సందర్భంగా వారి ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నా. 1965 లో గుజరాత్ సర్దార్ పటేల్ పోస్టులో సీఆర్పీఎఫ్ సిబ్బంది ధైర్యాన్ని గుర్తుంచుకున్నాను’’ అని గురువారం ట్వీట్ చేశారు. మాతృభూమి కోసం తమ ప్రాణాలను విడిచిన అమరవీరులను దేశం ఎప్పటికీ మరిచిపోదని ట్విట్టర్ వేదికగా మోదీ పేర్కొన్నారు.
Updated Date - 2020-04-09T19:49:21+05:30 IST