మోదీ పేరే ఓ మంత్రం : శివరాజ్ సింగ్ చౌహాన్
ABN, First Publish Date - 2020-05-30T20:22:23+05:30
మోదీ పేరే ఓ మంత్రమని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రపంచ యవనికపై
భోపాల్ : మోదీ పేరే ఓ మంత్రమని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రపంచ యవనికపై భారత్ను శక్తిశాలిగా తీర్చిదిద్దారని ఆయన పేర్కొన్నారు. మోదీ పగ్గాలు చేపట్టి యేడాది పూర్తైన సందర్భంగా ఆయన మాట్లాడారు. డైనమిక్ నాయకత్వ లక్షణాలకు, స్ఫూర్తినివ్వడంలో ఆయన శక్తిమంతుడని అభివర్ణించారు.
‘‘మోదీ పేరే ఓ మంత్రం. ‘ఎం’ అంటే నిరంతరం ప్రేరణనిచ్చేది. భారత్ను విశ్వగురువును చేయడంలో ఆయన మమ్మల్ని ప్రేరేపిస్తున్నారు. ‘o’ అంటే అవకాశం. భారత్లో దాగున్న అవకాశాలను ఆయన బయటికి తీస్తున్నారు. ‘డి’ అంటే క్రియాశీలక నాయకత్వం. ‘ఐ’ అంటే దేశాన్ని ప్రేరేపించేవారని... స్వావలంబన దిశగా భారత్ అడుగులు వేయడంలో ఆయన మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు’’ అని శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు.
Updated Date - 2020-05-30T20:22:23+05:30 IST