ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లతో మోదీ మాటా మంతి ఈ నెల 8న

ABN, First Publish Date - 2020-04-05T00:00:55+05:30

కరోనా వైరస్ మహమ్మారిపై దేశమంతా కలిసికట్టుగా పోరాడుతున్న సమయంలో రాజకీయ పార్టీలతో మాట్లాడాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారిపై దేశమంతా కలిసికట్టుగా పోరాడుతున్న సమయంలో రాజకీయ పార్టీలతో మాట్లాడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం తెలిపిన వివరాల ప్రకారం పార్లమెంటు ఉభయ సభల్లో ఐదుగురు కన్నా ఎక్కువ మంది ఎంపీలు ఉన్న పార్టీల ఫ్లోర్ లీడర్లతో మోదీ మాట్లాడతారు. ఈ కార్యక్రమం ఈ నెల 8న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరుగుతుంది.


కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనడం, దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న అష్ట దిగ్బంధనం వంటి అంశాలపై మోదీ చర్చించే అవకాశం ఉంది. అష్ట దిగ్బంధనం అమలు చేసిన తర్వాత మోదీ ప్రతిపక్షాలతో మాట్లాడటం ఇదే తొలిసారి అవుతుంది. 


ఇదిలావుండగా కోవిడ్-19పై వాట్సాప్ హెల్ప్‌డెస్క్ నెంబరును మోదీ ప్రకటించారు. ఈ నెంబరు : 9013151515. ఈ-మెయిల్ ఐడీ : ncov2019@gmail.com.


Updated Date - 2020-04-05T00:00:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising