మన్మోహన్, సోనియాకు మోదీ ఫోన్
ABN, First Publish Date - 2020-04-06T07:13:16+05:30
ప్రధాని మోదీ ఆదివారం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంఽధీకి ఫోన్ చేశారు. దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్, ఆ మహమ్మారి కారణంగా నెలకొన్న పరిస్థితులపై...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ప్రధాని మోదీ ఆదివారం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంఽధీకి ఫోన్ చేశారు. దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్, ఆ మహమ్మారి కారణంగా నెలకొన్న పరిస్థితులపై వారితో ఆయన చర్చించారు. మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్, మాజీ ప్రధాని దేవెగౌడ, ఎస్పీ నేతలు ములాయం, అఖిలేశ్, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్, పశ్చిమ బెంగాల్, ఒడిసా ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, డీఎంకే చీఫ్ స్టాలిన్, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్లతో కూడా మోదీ ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ఈ అంశమ్మీద బుధవారం లోక్సభ, రాజ్యసభల్లోని వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నేతలకు మోదీ ఫోన్ చేయనున్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మోదీ ఆదివారం నివాళులర్పించారు.
Updated Date - 2020-04-06T07:13:16+05:30 IST