ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్ధవ్ ఠాక్రే సలహాతో ఏకీభవించి, ఆచరణలో పెట్టిన ప్రధాని మోదీ

ABN, First Publish Date - 2020-04-03T00:07:01+05:30

కరోనా వైరస్ వ్యాప్తి, దేశవ్యాప్త లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి, దేశవ్యాప్త లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం విదితమే. అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతమున్న పరిస్థితులను మోదీ అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి సలహాలను కూడా స్వీకరించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రధాని మోదీకి ఓ సలహా ఇచ్చారు. ఆ సలహాతో ప్రధాని మోదీ వందశాతం ఏకీభవించారు.


ఆ సలహా ఏమంటే... మత పెద్దలు ఎలాంటి మత సమావేశాలు నిర్వహించకుండా చూడాలని వీడియో కాన్ఫరెన్స్‌లో ఉద్ధవ్ సలహా ఇచ్చారు. దీంతో మోదీ ఏకీభవించారు. ఏకీభవించడమే కాకుండా అందరు మత పెద్దలతో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడాలని, భారీ సంఖ్యలో ఒకే చోట గుమిగూడకుండా చూసే బాధ్యతతో పాటు సామాజిక దూరం పాటించేలా మత పెద్దలు చూడాలని ముఖ్యమంత్రులు కోరాలని ప్రధాని మోదీ సూచించినట్లు ఉద్ధవ్ ఠాక్రే కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. 

Updated Date - 2020-04-03T00:07:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising