ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిస్డ్ కాల్... వివాహిత ప్రేమాయణం... చివరకు కరోనా శిబిరంలో...

ABN, First Publish Date - 2020-07-08T20:20:34+05:30

తమిళనాడు రాష్ట్రంలోని నెల్‌లై జిల్లాలో జరిగిన సంఘటన ఇది. వివరాలిలా ఉన్నాయి. సేరన్‌ మహాదేవి ఓ కార్మికుడు. తన సమీప బంధువు కుమార్తెతో పదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఎనిమిదేళ్ళ కుమారుడు, నాలుగేళ్ళ కుమార్తె ఉన్నారు. కాగా... ఏడాదిన్నర క్రితం ఆమె ఫోన్‌కు కాయత్తార్‌కు చెందిన ఓ యువకుడి నుంచి ఓ మిస్డ్ కాల్ వచ్చింది. తొలుత దాన్ని పట్టించుకోలేదు కానీ ఆ తర్వాత ఆ మిస్డ్ కాల్ నుంచి వచ్చిన నెంబరుకు ఫోన్ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్‌లై : తమిళనాడు రాష్ట్రంలోని నెల్‌లై జిల్లాలో జరిగిన సంఘటన ఇది. వివరాలిలా ఉన్నాయి. సేరన్‌ మహాదేవి ఓ కార్మికుడు. తన సమీప బంధువు కుమార్తెతో పదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఎనిమిదేళ్ళ  కుమారుడు, నాలుగేళ్ళ కుమార్తె ఉన్నారు. కాగా... ఏడాదిన్నర క్రితం ఆమె ఫోన్‌కు కాయత్తార్‌కు చెందిన ఓ యువకుడి నుంచి ఓ మిస్డ్ కాల్ వచ్చింది. తొలుత దాన్ని పట్టించుకోలేదు కానీ ఆ తర్వాత ఆ మిస్డ్ కాల్ నుంచి వచ్చిన నెంబరుకు ఫోన్ చేసింది.


అటువైపు స్పందించిన ఓ యువకునితో కొద్దిసేపు ముచ్చటించింది. అలా సాగిన ముచ్చట్ల వ్యవహారం కాస్తా ప్రేమగా మారిపోయింది.అయితే తనకు పెళ్లయినట్లు ఆమె చెప్పలేదు. అంతేకాదు... తనను పెళ్లాడాలని అడగడంతో  అతడు కూడా సరేనన్నాడు. అలా 29 ఏళ్ల ఆ మహిళ 24 ఏళ్ల యువకుడిని గత 20 వ తేదీ తెన్‌కాశి సమీపంలోని సుందరపాండియన్‌ పురానికి వెళ్లి ప్రియుడి బంధువుల ముందు వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఊరుకు వెళ్లివస్తానని చెప్పి వెళ్ళిపోయింది.


అయితే... ఆమె  ఎంతకీ తిరిగి రాకపోవడంతో భర్త పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశాడు. మరోవైపు ప్రియుడిని పెళ్లాడిన మహిళ తన ఫోనులోని వాట్సాప్ స్టేటస్ లో... ప్రియుడితో వున్న ఫోటోను పెట్టింది కూడా. అది కాస్తా భర్త చూసి విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. దీంతో జులై ఒకటిన సదరు మహిళను, ప్రియుడిని పిలిచి విచారించగా అసలు విషయం బయటపడింది.


అప్పటికే పెళ్లయిన మహిళ తనకు వద్దని ఆ యువకుడు చెప్పేశాడు. మరోవైపు ఎవడినో పెళ్లి చేసుకున్న తన భార్య తనకు అవసరం లేదని భర్త చెప్పేశాడు. దీనితో ఆ మహిళను అంగీకరించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రస్తుతానికి సదరు మహిళను సేరన్‌ మహాదేవిలోని కరోనావైరస్ శిబిరానికి పంపారు. మూడు రోజులుగా ఆ మహిళ శిబిరంలోనే ఉంది. చివరికి ఆమెను ఎవరు అంగీకరిస్తారన్నది ప్రశ్నగా మిగిలింది.

Updated Date - 2020-07-08T20:20:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising