ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి ఆ ఆరు బ్యాంకులు కనిపించవ్..

ABN, First Publish Date - 2020-04-01T17:31:03+05:30

పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకుల్లోకి విలీనం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం నేటి నుంచి అమల్లోకి రానుంది. ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా విలీనం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం నేటి నుంచి అమల్లోకి రానుంది. దీంతో దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కి తగ్గనుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకులు నాలుగూ... చిన్న బ్యాంకులను తమలోకి విలీనం చేసుకున్నాయి. దీంతో ఈ పది బ్యాంకులు నేటి నుంచి నాలుగు బ్యాంకులుగా కార్యకలాపాలు నిర్వహించనున్నాయి.


ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండూ పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం కాగా.. సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకులోనూ, అలహాబాద్ బ్యాంకు ఇండియన్ బ్యాంకులోనూ కలిసిపోయాయి. ఇక ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం కావడంతో.. తెలుగు రాష్ట్రాల్లోనే పురాతన బ్యాంకుగా పేరుగాంచిన ఆంధ్రా బ్యాంకు నేటి నుంచి చరిత్ర పుటల్లోకి వెళ్లిపోనుంది. కరోనా కల్లోలం కారణంగా బ్యాంకుల విలీనం నిలిచిపోతుందని అందరూ భావించినా... ముందుగా ప్రకటించినట్టుగానే ఏప్రిల్ 1న విలీనం జరిగిపోయింది. విలీనమైన బ్యాంకు వినియోగదారులంతా ఆటోమేటిక్‌గా విలీనం చేసుకున్న బ్యాంకుల్లో సేవలు పొందొచ్చు. కాగా గతేడాది దేనా బ్యాంకు, విజయా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి విలీనం చేసిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-04-01T17:31:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising