కరోనా విజృంభణకు తబ్లీగీయే కారణమన్న వ్యక్తి కాల్చివేత
ABN, First Publish Date - 2020-04-05T22:07:48+05:30
దేశంలో కరోనా విజృంభించడానికి తబ్లిఘీ జమాత్ సంస్థే కారణమని టీ షాపులో వాదించిన ఓ వ్యక్తిని మరో వ్యక్తి కాల్చి చంపాడు.
లక్నో : దేశంలో కరోనా విజృంభించడానికి తబ్లిఘీ జమాత్ సంస్థే కారణమని టీ షాపులో వాదించిన ఓ వ్యక్తిని మరో వ్యక్తి కాల్చి చంపాడు. బాధితుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయంపై స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని నిందితుడ్ని అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం 9:30 గంటలకు ఓ టీ షాపులో వీరిద్దరూ వాదించుకున్నారు.
దేశంలో కరోనా విజృంభణకు తబ్లీఘీ సంస్థే కారణమంటూ బాధితుడు తీవ్రంగా మరో వ్యక్తితో వాదించాడు. ఈ వాదన ముదిరి ముదిరి కాల్చి వేతకు దారితీసినట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఈ సంఘటనపై స్థానిక ఏఎస్పీ మాట్లాడుతూ ప్రజలందరూ శాంతగా ఉండాలని, ఈ విషయంపై ఎవరూ ఘర్షణ వాతావరణానికి దిగొద్దని విజ్ఞప్తి చేశారు. వీరిద్దరి వ్యక్తిగత వివరాలు మాత్రం స్థానిక పోలీసులు బయటపెట్టలేదు.
Updated Date - 2020-04-05T22:07:48+05:30 IST