ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూట్యూబ్‌ చూసి శానిటైజర్‌ కంపెనీ!

ABN, First Publish Date - 2020-08-10T07:48:22+05:30

ప్రకాశం జిల్లా కురిచేడు శానిటైజర్‌ మరణాల కేసు కొలిక్కి వచ్చింది. దీంతో సంబంధం ఉన్న ఐదుగురిని పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారిలో పర్ఫెక్ట్‌ శానిటైజర్‌ కంపెనీ యజమాని శ్రీనివాస్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పోలీసుల అదుపులో ‘పర్ఫెక్ట్‌’ యజమాని సహా ఐదుగురు
  • కురిచేడు శానిటైజర్‌ మరణాల కేసు కొలిక్కి

కురిచేడు, ఆగస్టు 9: ప్రకాశం జిల్లా కురిచేడు శానిటైజర్‌ మరణాల కేసు కొలిక్కి వచ్చింది. దీంతో సంబంధం ఉన్న ఐదుగురిని పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారిలో పర్ఫెక్ట్‌ శానిటైజర్‌  కంపెనీ యజమాని శ్రీనివాస్‌, ముడి సరుకు అందజేసిన ఇద్దరు మార్వాడీలు, హైదరాబాద్‌లో డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్న మరో ఇద్దరు ఉన్నారు. వారిని హైదరాబాద్‌ నుంచి ఆదివారం తెల్లవారు జామున కురిచేడుకు తీసుకువచ్చారు. ఒకట్రెండ్రోజుల్లో కోర్టులో హాజరుపరిచే అవకాశముది. హైదరాబాద్‌లోని జీడిమెట్లకు చెందిన ఫర్ఫెక్ట్‌ శానిటైజర్‌ కంపెనీ యజమాని శ్రీనివాస్‌ మూడో తరగతి మాత్రమే చదివాడు. ప్రారంభంలో ఓ కిరాణా షాపులో పనిచేశాడు. తరువాత పర్ఫెక్ట్‌ కిరాణా మర్చంట్స్‌ పేరుతో గృహావసరాలకు ఉపయోగపడే దుకాణాన్ని నడిపాడు. లాక్‌డౌన్‌ సమయంలో శానిటైజర్లు, మాస్క్‌లు అమ్మకాలు చేశాడు. వ్యాపారం బాగుండడంతో యూట్యూబ్‌లో చూసి ఆ విధానంలో ఎలాంటి అనుమతులు లేకుండా శానిటైజర్‌ తయారు చేయడం ప్రారంభించాడు.  శానిటైజర్‌ తయారీలో ఇథైల్‌ ఆల్కహాల్‌తో పాటు మిథైల్‌ క్లోరైడ్‌ను వినియోగించడమే శ్రీనివాస్‌ చేసిన పెద్ద తప్పు. 16 మంది మృత్యువాత పడటానికి అదే కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.    


Updated Date - 2020-08-10T07:48:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising