ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల వేళ బెంగాల్ ప్రజలకు మమత మరో వరం!

ABN, First Publish Date - 2020-11-27T04:43:10+05:30

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ‘స్వస్త్య సాథి’ ఆరోగ్య పథకంపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ‘స్వస్త్య సాథి’ ఆరోగ్య పథకంపై సంచలన ప్రకటన చేశారు. ఇకపై ఈ పథకాన్ని రాష్ట్ర ప్రజలందరికీ వర్తింపజేస్తామని ఆమె పేర్కొన్నారు. వచ్చేనెల 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందనీ... కుల, మత, వృత్తిపరమైన అంశాలతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఈ పథకం కింద లబ్ధి చేకూర్చుతామని సీఎం తెలిపారు. ఇవాళ జరిగిన ఓ మీడియా సమావేశం సందర్భంగా మమత మాట్లాడుతూ.... ‘‘ఇంతకు ముందు మేము ‘స్వస్త్య సాథి’ పథకం కింద 7.5 కోట్ల మంది లబ్ధి దారులను నమోదు చేయాలని నిర్ణయించాం. అయితే ఇకపై పశ్చిమ బెంగాల్లోని ప్రతి కుటుంబాన్నీ, ప్రతి వ్యక్తినీ ఈ పథకంలోకి తీసుకువస్తాం. పిల్లలు, వృద్ధులు, మహిళలు సహా కులమతాలతో సంబంధం లేకుండా అందరికీ దీన్ని వర్తింపజేస్తాం..’’ అని పేర్కొన్నారు. ఈ పథకం కింద లబ్ధి పొందే విధంగా ప్రతి కుటుంబానికి ఓ స్మార్ట్ కార్డు ఇస్తామన్నారు. 2016 డిసెంబర్‌లో మమత సర్కారు అధికారికంగా ఈ పథకాన్ని ప్రారంభించింది. దీనికింద ప్రతియేటా  కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మెడికల్ కవరేజ్ అందిస్తారు. 

Updated Date - 2020-11-27T04:43:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising