ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మహేంద్ర రాజపక్సే
ABN, First Publish Date - 2020-08-09T18:09:20+05:30
మహేంద్ర రాజపక్సే ప్రధానిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ఆయనతో
శ్రీలంక : మహేంద్ర రాజపక్సే ప్రధానిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ఆయనతో ప్రమాణం చేయించారు. దేశ రాజధాని కొలంబోకు దగ్గర్లో ఉన్న ప్రముఖమైన బౌద్ధ గుడిలో ప్రమాణం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో పీపుల్స్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆయన పార్టీకి మూడింట రెండొంతుల మెజారిటీ సాధించారు.
ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించడం ఇది నాలుగో సారి. ఇక కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం సోమవారం జరగనుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. రాజ్యాంగం ప్రకారం మంత్రుల సంఖ్య 30 వరకూ ఉండొచ్చని రాజ్యాగం పేర్కొన్నా.... రాజపక్సే మాత్రం 26 మంత్రులతోనే కేబినెట్ కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.
Updated Date - 2020-08-09T18:09:20+05:30 IST