మధ్యప్రదేశ్లో 580 మంది పోలీసులకు కరోనా
ABN, First Publish Date - 2020-08-04T16:44:07+05:30
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 588 పోలీసులకు కరోనా సోకిందని, 2000 మంది పోలీసులను క్వారంటైన్ చేశామని...
భోపాల్ (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 588 పోలీసులకు కరోనా సోకిందని, 2000 మంది పోలీసులను క్వారంటైన్ చేశామని హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2వేల మంది పోలీసులకు సెలవు మంజూరు చేశామని, వారి కుటుంబసభ్యులకు కరోనా సోకుతుందనే భయంతో వారిని క్వారంటైన్ కు తరలించామని మంత్రి మిశ్రా చెప్పారు.పోలీసుల ఆరోగ్యం కాపాడటానికి తాము ప్రాధాన్యమిస్తామని మంత్రి చెప్పారు. కరోనా వల్ల అత్యవసర పరిస్థితులున్నా వారి ఆరోగ్య పరిస్థితుల వల్ల సెలవులు మంజూరుచేశామని మంత్రి వివరించారు.
Updated Date - 2020-08-04T16:44:07+05:30 IST