ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విటమిన్ డీ లోపం.. అధికమవుతున్న కరోనా మరణాలు!

ABN, First Publish Date - 2020-05-09T22:02:39+05:30

విటమిన్ డీ లోపం కారణంగా కరోనా కేసులు, మరణాలు అధికమయ్యే అవకాశం ఉన్నట్టు యూరప్ దేశాల్లో జరిగిన అధ్యయనంలో వెల్లడైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: విటమిన్ డీ లోపం కారణంగా కరోనా కేసులు, మరణాలు అధికమయ్యే అవకాశం ఉన్నట్టు యూరప్ దేశాల్లో జరిగిన అధ్యయనంలో వెల్లడైంది. బ్రిటన్‌లోని యాంగ్లియా రస్కిన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు దాదాపు 20 యూరప్ దేశాల్లో చేపట్టిన పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విటమిన్ డీ లోపం కారణంగా కరోనా బాధితుల్లో ఊపిరితిత్తుల సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశామున్నట్టు వారు గుర్తించారు.


రోగనిరోధక శక్తి పనితీరును విటమిన్ డీ ప్రభావితం చేస్తుంతదని, తెల్ల రక్తకణాలు విడుదల చేసిన సైటోకైన్ల స్థాయిల్లో మార్పులు తెస్తుందని వారు తెలిపారు. వైరస్‌ను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించే సైటోకౌన్లు.. విటమిన్ డీ లోపించినప్పుడు మాత్రం అధిక స్థాయిలో విడుదలై ఊపిరితిత్తులకు చేటు తెస్తాయని వారు అన్నారు. ఈ విధంగా రోగి పరిస్థితి మరింతగా దిగజారీ మరణం సంభవించే అవకాశం ఉందని వారు ప్రతిపాదిస్తున్నారు. ఇతర యూరప్ దేశాలతో పోలిస్తే విటమిన్ డీ సగలు స్థాయి తక్కువగా ఉండే  ఇటలీ స్పెయిన్‌లలో కరోనా మరణాల రేటు ఎక్కువగా ఉండటమే ఇందుకు నిదర్శనమని వారు చెప్పారు. 

Updated Date - 2020-05-09T22:02:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising