లోక్సభ సమావేశాలు నేడు నిరవధిక వాయిదా
ABN, First Publish Date - 2020-09-23T07:09:38+05:30
లోక్సభ వర్షాకాల సమావేశాలు బుధవారం నిరవధికంగా వాయిదా పడనున్నాయి. మరో 8
లోక్సభ వర్షాకాల సమావేశాలు బుధవారం నిరవధికంగా వాయిదా పడనున్నాయి. మరో 8 రోజుల సమయం ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధుల్లో కరోనా భయం నెలకొన్నందున సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు పార్లమెంటు వర్గాలు తెలిపాయి. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమై, 5 గంటలకు నిరవధికంగా వాయిదా పడనుంది.
కొత్త పార్లమెంటు భవనానికి రూ.971 కోట్లు
కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి రూ.971 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామని కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీ్పసింగ్ పురీ తెలిపారు. గత అంచనా కన్నా ఇది రూ.82 కోట్లు ఎక్కువ అని లోక్సభలో టీఎంసీ ఎంపీ మాలారాయ్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Updated Date - 2020-09-23T07:09:38+05:30 IST