ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌనే ఏకైక పరిష్కారం : రవిశంకర్ ప్రసాద్

ABN, First Publish Date - 2020-05-29T19:51:35+05:30

దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలు అందర్ని సంప్రదించిన తర్వాతే అమలులోకి తెచ్చామని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ పునరుద్ఘాటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలు అందర్ని సంప్రదించిన తర్వాతే అమలులోకి తెచ్చామని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ పునరుద్ఘాటించారు. కరోనా వైరస్‌కు ప్రస్తుతానికి మందు లేదని, లాక్‌డౌన్, ప్రార్థనలు ఒక్కటే మందులన్ని తెలిపారు. నిర్ణీత సమయంలో లాక్‌డౌన్‌ను విధించడంతోనే కరోనా మరణాలపై అదుపు సాధించామని అన్నారు. కేవలం ప్రాణాలను కాపాడటమే కాదని, ప్రజల బతకుదెరువును కూడా కాపాడాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు.


ఇంత క్లిష్ట సమయంలో కూడా డిజిటల్ ఇండియా అన్న ఐడియా దేశాన్ని బలోపేతం చేస్తోందని, అలాగే దేశాన్ని అత్యంత నిజాయితీతో నడిపిస్తున్నామని ప్రకటించారు. ‘‘అత్యంత నిజాయితీతో ఉన్న ప్రజలతో దేశాన్ని నడుపుతున్నాం. ప్రభుత్వాన్ని ఎవరూ వెలెత్తి చూపకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నాం. కరోనాతో పోరాడటానికి తగిన చర్యలు తీసుకున్నాం. సకారాత్మక విమర్శపై తమకు పూర్తి నమ్మకం ఉంది’’ అని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. 


Updated Date - 2020-05-29T19:51:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising