ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కఠువా కేసు నిందితుడిపై జువెనైల్‌ విచారణ ఆపండి: సుప్రీం

ABN, First Publish Date - 2020-02-08T08:49:43+05:30

జమ్మూ కశ్మీరులోని కఠువాలో ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్య కేసు కీలక మలుపు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: జమ్మూ కశ్మీరులోని కఠువాలో ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో మైనర్‌గా భావిస్తున్న నిందితుడిపై జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు (జేజేబీ)లో విచారణ నిలిపివేయాలంటూ జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌తో కూడిన సుప్రీం కోర్టు బెంచ్‌ స్టే ఇచ్చింది. 2018లో నేరం జరిగిన సమయానికి నిందితుడు మైనర్‌ అంటూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జమ్మూ కశ్మీరు హైకోర్టు పొరపాటుగా ధ్రువీకరించిందని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు తెలిపింది. మునిసిపల్‌, పాఠశాల రికార్డుల్లో నమోదైన నిందితుడి జనన తేదీలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్న విషయాన్ని హైకోర్టు గుర్తించలేదని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది పీఎస్‌ పట్వాలియా పేర్కొన్నారు. అతన్ని జువనైల్‌గానే పరిగణిస్తూ జేజేబీ విచారణ కొనసాగించడాన్ని తప్పుపట్టారు. ఈ వాదనను విన్న జస్టిస్‌ ఎన్వీ రమణ ధర్మాసనం... జేజేబీలో విచారణపై స్టే ఇచ్చింది. 

Updated Date - 2020-02-08T08:49:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising