ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ణాటకలో వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఏం చేశారో చూడండి..!

ABN, First Publish Date - 2020-06-03T03:35:34+05:30

కర్ణాటక వైద్యఆరోగ్య శాఖ మంత్రి బి శ్రీరాములు సోషల్‌ డిస్టెన్స్‌ నిబంధనలను ఉల్లంఘించడం చర్చనీయాంశంగా మారింది. చిత్రదుర్గ జిల్లా చల్లకేరే తాలుకా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్ణాటక: కర్ణాటక వైద్యఆరోగ్య శాఖ మంత్రి బి శ్రీరాములు సోషల్‌ డిస్టెన్స్‌ నిబంధనలను ఉల్లంఘించడం చర్చనీయాంశంగా మారింది. చిత్రదుర్గ జిల్లా చల్లకేరే తాలుకా పరశురాంపురలో ఆలయ ఉత్సవానికి శ్రీరాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీగా ఆయన అనుచరులు తరలివచ్చారు. ఆపిల్స్‌తో గజమాల వేసేందుకు అనుచరులు ప్రయత్నించారు. ఈ సందర్భంలో.. ఒకరిపై ఒకరు పడుతూ కేరింతలతో కేకలు వేశారు. భౌతిక దూరం అన్న మాటే మరిచారు. ఇక్కడ మరో కొసమెరుపేంటంటే.. సన్మానం ముగిసిన తర్వాత భౌతికదూరంపై శ్రీరాములు ఉపన్యసించారు.


మంత్రి శ్రీరాములు గాలి జనార్దన్‌రెడ్డి అనుచరుడన్న విషయం తెలిసిందే. శ్రీరాములు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక రాష్ట్రానికి వైద్య శాఖ మంత్రి అయి ఉండి.. ప్రజలకు భౌతిక దూరం ఆవశ్యకతను వివరించాల్సిన మంత్రే కరోనా తీవ్రత పెరుగుతున్న తరుణంలో ఇలా ప్రవర్తించడమేంటని మండిపడుతున్నారు.



Updated Date - 2020-06-03T03:35:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising