ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ ప్రశంసలందుకున్న కామె గౌడకు జీవితకాల ఉచిత బస్ పాస్ సదుపాయం

ABN, First Publish Date - 2020-07-03T04:46:01+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలందుకున్న మాండ్యా జిల్లావాసి కామె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలందుకున్న మాండ్యా జిల్లావాసి కామె గౌడకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం జీవిత కాల ఉచిత బస్ పాస్ సదుపాయం కల్పించింది. ఈ బస్ పాస్‌ను ఉపయోగించి కామె గౌడ కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో అన్ని తరగతులలో ఉచితంగా ప్రయాణించవచ్చు. 


ముఖ్యమంత్రి యడియూరప్ప ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ప్రజలతో పంచుకున్నారు. కామె గౌడకు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జీవితకాల ఉచిత బస్ పాస్‌ సదుపాయం కల్పించిందని పేర్కొన్నారు. 


మాండ్యా జిల్లాలోని దాసనదొడ్డివాసి అయిన కామె గౌడ తన పశువులను మేపుకునేందుకు వెళ్ళిన చోట 16 చిన్న తరహా చెరువులను తవ్వారు. 


గౌడ తవ్విన చెరువుల కారణంగా భూగర్భ జలాలు పెరగడంతోపాటు, పచ్చదనం కూడా వృద్ధి చెందింది. ఆయన సేవలను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం 2018లో కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారంతో సత్కరించింది. కామె గౌడ ఘనతను ప్రధాని మోదీ తన రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించిన సంగతి తెలిసిందే.


Updated Date - 2020-07-03T04:46:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising