ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలు ఎంతమాత్రం సమర్థనీయం కావు : కరణ్ సింగ్

ABN, First Publish Date - 2020-10-14T23:22:25+05:30

ఆర్టికల్ 370 పై కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఎంత మాత్రమూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 పై కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఎంత మాత్రమూ సమర్థనీయం కావని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ దౌత్యవేత్త కరణ్ సింగ్ స్పష్టం చేశారు. ‘‘ఆర్టికల్ 370 ని పునరుద్ధరణ విషయంలో నా పాత స్నేహితుడు ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కావు. వాస్తవం కాని అంచనాలను ప్రజల్లో రేకెత్తించేవారవుతారు’’ అంటూ కరణ్ సింగ్ వ్యాఖ్యానించారు.


‘‘ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఆయన చికాకును నేను అర్థం చేసుకోగలను. ఓ సంవత్సరం పాటు ఆయన గృహ నిర్బంధంలో కూడా ఉన్నారు. అయినా సరే... ఆర్టికల్ 370 విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత మాత్రం సమర్థనీయం కావు.’’ అని కరణ్ సింగ్ పేర్కొన్నారు. 


చైనా సహాయంతో జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 ని తిరిగి పునరుద్ధరిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దును అటు చైనా గానీ, ఇటు కశ్మీరీ ప్రజలు గానీ ఎన్నడూ అంగీకరించలేదని, గత ఒప్పందాలకు విరుద్ధంగా తొలగించారు కాబట్టే చైనా యుద్ధానికి దిగుతోందని అబ్దుల్లా వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-10-14T23:22:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising