మత సామరస్యం పాటిద్దాం : జస్టిస్ సంతోశ్ హెగ్డే
ABN, First Publish Date - 2020-08-05T07:20:40+05:30
ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న సంక్షోభానికి ప్రధాన కారణాల్లో మతం కూడా ఒకటని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంతోశ్ హెగ్డే
బెంగళూరు, ఆగస్టు 4: ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న సంక్షోభానికి ప్రధాన కారణాల్లో మతం కూడా ఒకటని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంతోశ్ హెగ్డే వ్యాఖ్యానించారు. శాంతియుతంగా సహజీవనం చేస్తూ మత సామరస్యం పాటించడం ముఖ్యమని పేర్కొన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పూజపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2020-08-05T07:20:40+05:30 IST