ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లుపై జాయింట్ కమిటీ భేటీ ఈ నెల 28న

ABN, First Publish Date - 2020-10-23T17:07:34+05:30

వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు, 2019పై ఏర్పాటైన పార్లమెంటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు, 2019పై ఏర్పాటైన పార్లమెంటు జాయింట్ కమిటీ ఈ నెలాఖర్లో భేటీ కాబోతోంది. ఈ కమిటీ గత ఏడాది డిసెంబరులో ఏర్పాటైంది. ఈ కమిటీ సమక్షంలో ట్విటర్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, పేటీఎం, గూగుల్ ప్రతినిథులు హాజరై, మౌఖిక స్టేట్‌మెంట్లు ఇస్తారు. 


వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు, 2019పై గత ఏడాది డిసెంబరులో ఏర్పాటైన పార్లమెంటు జాయింట్ కమిటీ ఈ నెల 28, 29 తేదీల్లో భేటీ అవుతుందని, ఈ కమిటీ సభ్యులకు జారీ చేసిన నోటీసుల ప్రకారం తెలుస్తోంది. ఈ కమిటీ సమక్షంలో ఈ నెల 28న ట్విటర్, అమెజాన్ వెబ్ సర్వీస్ప్రతినిథులు హాజరై, తమ స్టేట్‌మెంట్లను ఇస్తారు. పేటీఎం, గూగుల్ ప్రతినిథులు ఈ నెల 29న హాజరై, తమ స్టేట్‌మెంట్లను ఇస్తారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం నోటీసు జారీ చేసింది. 


ఈ కమిటీ సమావేశం పార్లమెంటు హౌస్‌లో జరుగుతుంది. ఈ సమావేశానికి హాజరుకావాలని ఈ కమిటీ సభ్యులను కోరారు. మీనాక్షి లేఖి, ఎస్ఎస్ అహ్లూవాలియా, పీపీ చౌదరి, రాజీవ్ చంద్రశేఖర్, డెరెక్ ఒబ్రెయిన్ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 


Updated Date - 2020-10-23T17:07:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising