బీజేపీ నేత కుటుంబాన్ని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు
ABN, First Publish Date - 2020-07-09T03:39:10+05:30
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో బీజేపీ నేత కుటుంబాన్ని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. బండిపోరా జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు వాసిం బరిని ఆయన తండ్రిని, సోదరుడిని ఉగ్రవాదులు కాల్చిచంపారు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో బీజేపీ నేత కుటుంబాన్ని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. బండిపోరా జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు వాసిం బరిని ఆయన తండ్రిని, సోదరుడిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. రాత్రి 9 గంటల సమయంలో ఘటన జరిగింది. వాస్తవానికి వాసిం కుటుంబానికి 8 మంది భద్రతా సిబ్బంది రక్షణ కల్పిస్తోంది. అయితే ఘటన జరిగిన సమయంలో ఎవ్వరూ లేకుండాపోయారని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు.
Updated Date - 2020-07-09T03:39:10+05:30 IST