ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండింటికే రాహుల్ హాజరయ్యారు.... పైగా వాకౌటా? జవదేకర్ ఫైర్

ABN, First Publish Date - 2020-12-17T19:21:09+05:30

రక్షణ శాఖ పార్లమెంటరీ ప్యానల్ సమావేశం నుంచి రాహుల్ గాంధీ మధ్యలోనే నిష్క్రమించడంపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తీవ్రంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : రక్షణ శాఖ పార్లమెంటరీ ప్యానల్ సమావేశం నుంచి రాహుల్ గాంధీ మధ్యలోనే నిష్క్రమించడంపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తీవ్రంగా మండిపడ్డారు. రక్షణ శాఖకు సంబంధించిన పార్లమెంట్ ప్యానల్ సమావేశాలు మొత్తం 14 జరిగితే అందులో 2 సమావేశాలకు మాత్రమే రాహుల్ గాంధీ హాజరయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘రక్షణ శాఖ పార్లమెంటరీ ప్యానల్ సమావేశాలు మొత్తం 14 జరిగాయి. అందులో రాహుల్ గాంధీ రెండింటికి మాత్రమే హాజరయ్యారు. మిగితా వాటికి హాజరు కాలేదు. అయినా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను  నిందిస్తున్నారు. అంతేకాకుండా నిరసనగా సమావేశం నుంచి వాకౌట్ చేశారు.’’ అంటూ ప్రకాశ్ జవదేకర్ మండిపడ్డారు. 

రక్షణ శాఖలో యూనిఫామ్‌, హోదాల గురించి చర్చించేందుకు ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానెల్‌ సమావేశం నుంచి రాహుల్‌ గాంధీ మధ్యలోనే నిష్క్రమించారు. ఆయనతో పాటే రాజీవ్‌ సతావ్‌, రేవంత్‌రెడ్డి తదితర కాంగ్రెస్‌ సభ్యులూ వాకౌట్‌ చేశారని అంతర్గత వర్గాలు వెల్లడించాయి.

Updated Date - 2020-12-17T19:21:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising