జమ్మూ కాశ్మీర్లో కొత్తగా 143 కరోనా కేసులు
ABN, First Publish Date - 2020-06-07T02:17:57+05:30
జమ్మూ కాశ్మీర్లో కొత్తగా 143 కరోనా కేసులు నమోదైనట్లు...
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో కొత్తగా 143 కరోనా కేసులు నమోదైనట్లు ప్రభత్వం వెల్లడించింది. గత 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. వీటితో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య 3,467కు చేరింది. వీరిలో 1,126 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 2,302 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 39 మరణాలు ఇక్కడ సంభవించినట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది.
Updated Date - 2020-06-07T02:17:57+05:30 IST