ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తేజస్వీకి సీఎం నితీశ్ రెమెడీ

ABN, First Publish Date - 2020-10-21T21:11:38+05:30

ఎన్నికల నగారా మోగింది. అన్ని పక్షాలూ వ్యూహ ప్రతి వ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. వ్యక్తిగతంగా సంబంధాలు బాగానే ఉన్నా.... ప్రచారంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా : ఎన్నికల నగారా మోగింది. అన్ని పక్షాలూ వ్యూహ ప్రతి వ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. వ్యక్తిగతంగా సంబంధాలు బాగానే ఉన్నా.... ప్రచారంలో మాత్రం నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు. విమర్శల జడివానను కురిపించుకుంటారు. కానీ... బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఇందుకు కాస్త భిన్నంగా ప్రవర్తించి.... పెద్దరికాన్ని నెలబెట్టుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆర్జేడీ యువనేత తేజస్వీ చాలా బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. దీంతో గొంతు బొంగురు పోవడం, గొంతు నొప్పి లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు నితీశ్ విరుగుడు చెప్పారు.


‘‘ప్రతి రోజూ వేడి నీటిని బాగా తీసుకోండి. ఈ సలహా నాకు జార్జ్ ఫెర్నాండేజ్ ఇచ్చారు. ఆయన సలహా ఇవ్వనంత వరకూ నేనూ చల్లటి నీటినే తాగేవాణ్ని.’’ అని నితీశ్ తేజస్వీకి రెమెడీ సూచించారు. ఈ ఘటన దివంగత రాం విలాస్ పాశ్వాన్ ‘‘దశ దినకర్మ’’ సందర్భంగా చోటు చేసుకుంది. రాం విలాస్ దశదిన కర్మను పురస్కరించుకొని సీఎం నితీశ్ ఆయన నివాసానికి వెళ్లారు. ఆ కార్యక్రమానికి తేజస్వీ కూడా హాజరయ్యారు. 

Updated Date - 2020-10-21T21:11:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising