మాకు ఓటివ్వండి.. మీకు వ్యాక్సిన్ ఇస్తాం : రౌత్ చురకలు
ABN, First Publish Date - 2020-10-23T16:42:09+05:30
ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తామన్న బీజేపీ ప్రకటనపై శివసేన ఎంపీ సంజయ్
ముంబై : ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తామన్న బీజేపీ ప్రకటనపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘మీరు నాకు రక్తాన్నివ్వండి... నేను మీకు స్వాతంత్య్రం ఇస్తా’’ అన్నది అప్పటి నినాదం. ‘‘మీరు నాకు ఓటు వేయండి... మేము మీకు వ్యాక్సిన్ ఇస్తాం’’ అన్నది నేటి మాట. బీజేపీకి ఓటువేసే వారికి మాత్రమే వ్యాక్సిన్. బీజేపీ చూపిస్తున్న వివక్షతకు ఇదే నిదర్శనం. ఇదీ బీజేపీ స్వభావం’’ అని సంజయ్ రౌత్ చురకలంటించారు.
అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ : నిర్మల
ఎన్డీఏ మళ్లీ అధికారంలోకొస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ అందిస్తామని బిహార్ ప్రజలకు బీజేపీ హామీ ఇచ్చింది. విజన్ డాక్యుమెంట్ పేరిట కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ‘‘కరోనాపై పోరులో భారత్ ముం దు వరుసలో ఉంది. మూడు వ్యాక్సిన్లు ప్రయోగ పరీక్షల దశలో ఉన్నాయి. ఐసీఎంఆర్ క్లియరెన్స్ ఇచ్చిన వెంటనే ఈ వ్యాక్సిన్ను బిహార్ ప్రజానీకానికి అందుబాటులో ఉంచు తాం. ఉచితంగా పంపిణీ చేస్తాం’’ అని నిర్మల చెప్పారు. కాగా, అత్యంత కీలకమైన ఈ వ్యాక్సిన్ను ఉచితంగా ఇస్తామని ఓ రాజకీయ పార్టీ ప్రకటించడం ఇదే ప్రథమం
Updated Date - 2020-10-23T16:42:09+05:30 IST