ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘తృణముల్.. అత్త, మేనల్లుడు నడిపే కంపెనీలా తయారైంది’

ABN, First Publish Date - 2020-12-28T04:06:45+05:30

తృణముల్ మాజీ మంత్రి, ఇటీవల బీజేపీలో చేరిన సుబేందు అధికారి మమత పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తృణముల్ ఇప్పుడో కంపెనీలా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కత్తా: తృణముల్ మాజీ మంత్రి, ఇటీవల బీజేపీలో చేరిన సుబేందు అధికారి మమత పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తృణముల్ ఇప్పుడో కంపెనీలా తయారైందని.. అత్త, మేనల్లుడి ఆధ్వర్యంలో అది నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తృణముల్‌ను ఎందుకు వీడారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు. 21 ఏళ్లు తృణముల్‌లో భాగమైనందుకు సిగ్గుపడుతున్నానని సువేందు అధికారి ఇప్పటికే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తృణముల్‌లో క్రమశిక్షణ అంటూ ఉండదని, అందుకే ఆ కంపెనీ నుంచి బయటపడి.. సరైన రాజకీయ పార్టీలో సభ్యత్వం తీసుకున్నానని ఆయన వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వాన్ని తీసుకొచ్చే సంప్రదాయానికి బీజేపీ శ్రీకారం చుట్టనుందని ఆయన చెప్పారు. 



Updated Date - 2020-12-28T04:06:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising