ఐఎస్ చేతికి మొజాంబిక్ పోర్టు
ABN, First Publish Date - 2020-08-15T07:46:57+05:30
ఆఫ్రికా దేశమైన మొజాంబిక్లో అత్యంత కీలకమైన మొచింబోవా డా ప్రైయా పోర్టు ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదుల సొంతమైంది. దాదాపు మూడేళ్లుగా ఈ పోర్టు కోసం ఉగ్రవాదులు సైన్యం...
- సమీపంలోనే రూ. 4.4 లక్షల కోట్ల గ్యాస్ క్షేత్రం
మాపుటో/వాషింగ్టన్, ఆగస్టు 14: ఆఫ్రికా దేశమైన మొజాంబిక్లో అత్యంత కీలకమైన మొచింబోవా డా ప్రైయా పోర్టు ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదుల సొంతమైంది. దాదాపు మూడేళ్లుగా ఈ పోర్టు కోసం ఉగ్రవాదులు సైన్యం, పౌరులపై దాడులు చేస్తున్నారు. ముష్కరులు సృష్టించిన హింసలో 1000మంది వరకూ చనిపోగా.. 2.10 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి అంచనా. కాగా.. ఈ పోర్టుకు అత్యంత సమీపంలోనే రూ. 4.4 లక్షల కోట్లు విలువైన గ్యాస్ నిక్షేపాలు కలిగిన క్షేత్రం ఉంది. పోర్టు చుట్టుపక్కల ప్రాంతాల్ని ఐఎస్ క్రమక్రమంగా ఆక్రమిస్తోంది. ఐఎస్ తర్వాతి లక్ష్యం గ్యాస్ క్షేత్రమే కావచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆయుధ సామగ్రి కొరత, మరోవైపు భారీగా ఉన్న ఉగ్రవాదుల్ని ఎదుర్కోలేక సైన్యం పోర్టును విడిచి పరారైనట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
Updated Date - 2020-08-15T07:46:57+05:30 IST