మేము కూడా తొందర పడట్లేదు...ఇదీ భారత్ రెస్పాన్స్
ABN, First Publish Date - 2020-02-20T02:26:04+05:30
ఒప్పందం కుదుర్చుకునేందుకు తాము కూడా తొందరు పడట్లేదని వ్యాఖ్యానించాయి.
న్యూఢిల్లీ: తాజా పర్యటనలో అమెరికా-భారత్ల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరదంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల పట్ల భారత వర్గాలు స్పందించాయి. ఒప్పందం కుదుర్చుకునేందుకు తాము కూడా తొందరు పడట్లేదని వ్యాఖ్యానించాయి. ‘అమెరికా లాగా మేము కూడా ఒప్పందం కుదుర్చుకునేందుకు తొందర పడట్లేదు. ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన ఒప్పందం కోసం మేం ప్రయత్నిస్తున్నాం. ఇది చాలా సంక్లిష్లమైన విషయం. భవిష్యత్తులో పెద్ద ఒప్పందం కుదుర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నాం.’ అని భారత వర్గాలు వ్యాఖ్యానించాయి. ఈ విషయంలో ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన ఏమీ లేదని, చర్చలు కొనసాగుతున్నాయని తెలిపాయి.
Updated Date - 2020-02-20T02:26:04+05:30 IST