రైతులకు లాక్డౌన్ నుంచి మినహాయింపునిచ్చిన పంజాబ్
ABN, First Publish Date - 2020-04-10T20:23:31+05:30
లాక్డౌన్ నుంచి రైతులకు పంజాబ్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. పంటలు చేతికి వచ్చే సమయం కాబట్టి, పంట కోతలు కూడా ఉంటాయని
లక్నో : లాక్డౌన్ నుంచి రైతులకు పంజాబ్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. పంటలు చేతికి వచ్చే సమయం కాబట్టి, పంట కోతలు కూడా ఉంటాయని అందుకే రైతులను లాక్డౌన్ ప్రస్తుతం మినహాయింపును కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. అయితే ఈ సడలింపును జిల్లాల వారీగా అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
అయితే మిగితా వారు మాత్రం లాక్డౌన్ను కచ్చితంగా పాటించాల్సిందేనని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని, దీని దృష్ట్యా లాక్డౌన్ పొడగింపుకే నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పంజాబ్ నుంచి మొత్తం 651 మంది నిజాముద్దీన్ సదస్సుకు వెళ్లారని, అందులో 636 మందిని ఇప్పటికే తమ ప్రభుత్వం గుర్తించిందని, మిగితా 15 మంది ఇంకా దొరకలేదని, వారికోసం వెతుకులాట కొనసాగుతోందని అమరీందర్ సింగ్ ప్రకటించారు.
Updated Date - 2020-04-10T20:23:31+05:30 IST