జైళ్లలో ఖైదీల ములాఖత్కు ఆరునెలల తర్వాత అనుమతి
ABN, First Publish Date - 2020-10-01T14:07:41+05:30
కరోనా సంక్షోభం వల్ల జైళ్లలో నిలిచిన ఖైదీల ములాఖత్లకు ఎట్టకేలకు ఢిల్లీ జైళ్లశాఖ అనుమతించింది....
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం వల్ల జైళ్లలో నిలిచిన ఖైదీల ములాఖత్లకు ఎట్టకేలకు ఢిల్లీ జైళ్లశాఖ అనుమతించింది. కరోనా వ్యాప్తి వల్ల గత ఆరు నెలలుగా నిలిచిపోయిన ఖైదీల ములాఖత్ కు అక్టోబరు 1వ తేదీ నుంచి జైళ్ల శాఖ అధికారులు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జైళ్లలో ఖైదీలకు కరోనా సోకుతుండటంతో మార్చి23వతేదీ నుంచి ఖైదీలను కుటుంబసభ్యులు కలవడంపై నిషేధించారు. తమ కుటుంబసభ్యులను కలిసేందుకు తమను అనుమతించాలని కోరుతూ గత రెండు నెలలుగా పలువురు ఖైదీలు జైలు అధికారులకు లేఖలు రాశారు. దీంతో ఖైదీలను కలిసేందుకు వచ్చే కుటుంబసభ్యులు ఖైదీల కోసం కొత్త బట్టలు తీసుకురావాలని జైలు అధికారులు కోరారు.
ఢిల్లీలోని మూడు జైళ్లలో 14వేల మంది ఖైదీలున్నారు. ఒక ఖైదీ నెలకు ఒకసారి వారి కుటుంబసభ్యుడిని కలిసేందుకు అనుమతించ నున్నారు. జైలులో ఖైదీల ములాఖత్ కోసం వచ్చే సందర్శకులకు థర్మల్ స్కాన్ చేస్తారు. దీంతోపాటు కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తిని కలిసేందుకు అనుమతించరు. ఢిల్లీలోని తిహార్, మండోలి, రోహిణి జైళ్లలో 83 మంది ఖైదీలు, 207 మంది జైలు ఉద్యోగులకు కరోనా సోకింది.
Updated Date - 2020-10-01T14:07:41+05:30 IST