ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలకు డబ్బులు ఇవ్వలేం.. లాక్ డౌన్ ఎత్తేస్తాం: పాక్ ప్రధాని

ABN, First Publish Date - 2020-06-03T00:46:32+05:30

పాకిస్థాన్‌లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ లాక్ డౌన్ ఎత్తేయబోతున్నామని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ లాక్ డౌన్ ఎత్తేయబోతున్నామని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ప్రకటించారు. కరోనాతో కలసి జివించాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు విన్నవించారు. ఆర్థిక స్థితి కుప్పకూలే స్తితికి చేరుకోవడంతో పాక్ ఇప్పటికే అనేక ఆంక్షలకు ముగింపు పలికింది. త్వరలో పర్యటక రంగాన్ని కూడా పునఃప్రారంభించబోతున్నట్టు ప్రకటించింది. ఒక్క లాహోర్‌ నగరంలోనే దాదాపు 7 లక్షల కరోనా కేసులు ఉంటాయంటూ ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలు వెలువడ్డ కొద్ది సేపటికే ప్రధాని ఈ ప్రకటన చేశారు. ఇతర దేశాల వలె పాక్ లాక్ డౌన్‌ను సుదీర్ఘకాలం భరించలేదని టీవీ ప్రసంగంలో ప్రజలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. 13 నుంచి 15 కోట్ల మంది పేదలు లాక్ డౌన్ కారణంగా ప్రభావితమయ్యారని వారందరి చేతుల్లో డబ్బులు ఉంచే శక్తి ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. పేదలకు ఇంకెన్నాళ్లు ధన సహాయం చేయగలం. వారికి డబ్బూ ఇస్తూ పోయేందుకు మన ఆర్థిక పరిస్తితి అంగీకరించదు. అని ఆయన వ్యాఖ్యానించారు. లాక్ డౌన్‌లు కరోనాను అడ్డుకోలేవని కూడా ఆయన చెప్పుకొచ్చారు. 

Updated Date - 2020-06-03T00:46:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising