బిడెన్ గెలిస్తే... డేటన్ సభలో ట్రంప్ ధ్వజం
ABN, First Publish Date - 2020-09-24T01:28:01+05:30
రాజకీయ నేతగా అయిదు దశాబ్దాల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించారు. నవంబర్ 3 న జరగనున్న ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ గెలిస్తే చైనా గెలిచినట్టే’నని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
డేటన్ : రాజకీయ నేతగా అయిదు దశాబ్దాల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించారు. నవంబర్ 3 న జరగనున్న ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ గెలిస్తే చైనా గెలిచినట్టే’నని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
బిడెన్ (77), కమలాహారిస్, అధ్యక్షుడు ట్రంప్ (74). ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్కు... ధీటైన ప్రత్యర్థులుగా ఉన్న విషయం తెలిసిందే. బిడెన్ నాలుగున్నర దశాబ్దాలుకు పైగా పదవిలో ఉన్నప్పటికీ... మీ ఉద్యోగాలు చైనాకు, ఇతర దేశాలకు రవాణా చేయించారంటూ ట్రంప్ ధ్వజమెత్తారు. తాను గత నాలుగేళ్లలో ఉద్యోగాలను స్వదేశానికిరప్పించగలిగానని డేటన్, ఓహియోల్లో ఎన్నికల ర్యాలీల సందర్భంగా ట్రంప్పేర్కొన్నారు.
నవంబర్ 3 నాటి ఎన్నికల్లో మన దేశాన్ని నూతన పురోగతి శిఖరాలకు తీసుకెళ్తారో లేక జో బిడెన్, వంటి వారికి అవకాశం ఇచ్చి ఆర్థిక ప్రగతిని అధోగతి పాలు చేస్తారో అమెరికా ప్రజలు నిర్ణయిస్తారని పేర్కొన్నారు.
నాలుగు ట్రిలియన్ డాలర్ల పన్ను పెంపు, ఓహియో బొగ్గు, చమురు, సహజవాయువుల ఒప్పందం రద్దు, చైనా తదితర దేశాలకు ఉద్యోగాల తరలింపు... బిడెన్ ఎన్నికైతే జరిగే పరిణామాలుగా ట్రంప్ అభివర్ణించారు.
Updated Date - 2020-09-24T01:28:01+05:30 IST