సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి
ABN, First Publish Date - 2020-07-05T14:15:56+05:30
పుల్వామాలోని గంగూ ప్రాంతంలో ఆదివారం ఉదయం సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు ఐఈడీ అటాక్ చేశారు.
శ్రీనగర్ : పుల్వామాలోని గంగూ ప్రాంతంలో ఆదివారం ఉదయం సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు ఐఈడీ అటాక్ చేశారు. ఈ దాడిలో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాదులు పక్కాగా దాడికి దిగినట్లు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడి జరిగిన మరుక్షణమే సీఆర్పీఎఫ్ దళాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరగడం ప్రారంభమయ్యాయి. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోందని సీఆర్పీఎఫ్ అధికారులు ప్రకటించారు.
Updated Date - 2020-07-05T14:15:56+05:30 IST