ఫార్మా శాఖ పెద్దను.. క్వారంటైన్ ఉల్లంఘించిన కేంద్ర మంత్రి వివరణ
ABN, First Publish Date - 2020-05-26T02:58:37+05:30
ఇటీవల ఢిల్లీ నుంచి బెంగళూరు వచ్చిన కేంద్ర మంత్రి సదానంద గౌడ..
న్యూఢిల్లీ: ఇటీవల ఢిల్లీ నుంచి బెంగళూరు వచ్చిన కేంద్ర మంత్రి సదానంద గౌడ.. క్వారంటైన్ నిబంధనలు పాటించలేదు. దీనిపై పలువురు విమర్శలు కురిపించారు. దీనిపై సదానంద గౌడ వివరణనిచ్చారు. తాను ఫార్మాశాఖ అధిపతినని, కేంద్ర మంత్రినని ఆయన చెప్పారు. ‘మార్గదర్శకాలు అందరికీ ఒకటే. అది నిజమే. కానీ అత్యవసర బాధ్యతలు నిర్వర్తించే కొందరికి వీటి నుంచి మినహాయింపు ఉంటుంది’ అని సదానంద గౌడ పేర్కొన్నారు.
Updated Date - 2020-05-26T02:58:37+05:30 IST