ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం

ABN, First Publish Date - 2020-06-05T00:24:00+05:30

హిమాచల్ ప్రదేశ్‌లో పంచాయతీలు, అర్బన్ లోకల్ బాడీస్ ఆర్థిక పరిస్థితిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్‌లో పంచాయతీలు, అర్బన్ లోకల్ బాడీస్ ఆర్థిక పరిస్థితిని సమీక్షించేందుకు 6వ ఫైనాన్స్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 


రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 6వ ఫైనాన్స్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పన్నులు, సుంకాలు, టోల్, ఫీజులు వంటివాటిని నిర్ణయించి, పంచాయతీల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచేందుకు తగిన సిఫారసులను గవర్నర్‌కు ఈ కమిషన్ సమర్పిస్తుంది. 


పంచాయతీలు, అర్బన్ లోకల్ బాడీస్ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచేందుకు తీసుకోవడానికి సంబంధించిన ఇతర అంశాలను కూడా పరిశీలించేందుకు ఈ కమిషన్‌కు అధికారం ఉంది.


Updated Date - 2020-06-05T00:24:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising