ముంబైలో భారీ వర్షాలు... ఆగిన లోకల్ రైళ్లు... కార్యాలయాల మూసివేతకు ఆదేశాలు!
ABN, First Publish Date - 2020-08-04T14:38:26+05:30
మహానగరం ముంబైలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కింగ్ సర్కిల్ వద్ద రెండు అడుగుల మేరకు నీరు నిలిచిపోయింది.
ముంబై: మహానగరం ముంబైలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కింగ్ సర్కిల్ వద్ద రెండు అడుగుల మేరకు నీరు నిలిచిపోయింది. గడచిన 10 గంటల్లో ముంబై నగరంలో 230 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ తెలిపింది. అరేబియా సముద్రంపై చురుకైన రుతుపవనాల కదలిక కారణంగా ముంబైలో భారీ వర్షాలు కరుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా లోకల్ రైళ్లు నిలిచిపోయాయి. భారీ వర్ష సూచనను దృష్టిలో ఉంచుకుని ఈ రోజు అన్ని కార్యాలయాలు, ఇతర సంస్థలను మూసివేయాలని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. కాగా రాబోయే రెండు రోజుల్లో ముంబైతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరిక జారీ చేసింది.
Updated Date - 2020-08-04T14:38:26+05:30 IST